బాయ్ఫ్రెండ్ దారుణ హత్య
- November 21, 2018
యూఏఈ: మొరాకో మహిళ, తన మాజీ బాయ్ఫ్రెండ్ని అతి కిరాతకంగా హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి, కొంత భాగాన్ని వంట చేసి, ఆ వంటకాన్ని తన ఇంటి సమీపంలో వున్న కన్స్ట్రక్షన్ కార్మికులకు వడ్డించింది. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోందిప్పుడు. మృతుడి ఆచూకీ కోసం అతని సోదరుడు ప్రయత్నించడంతో ఈ కేసు వెలుగు చూసింది. తన సోదరుడి గురించి, నిందితురాల్ని మృతుడి సోదరుడు ఆరా తీయగా, ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. తాము విడిపోయామని తెలిపింది. అయితే, ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా కన్పించిన ఓ వస్తువు నేపథ్యంలో పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు, నిందితురాలు చేసిన నిర్వాకం తెలిసింది. బాయ్ఫ్రెండ్ మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం, స్నేహితురాలితో మొత్తం ఇంటిని క్లీన్ చేయించినట్లు విచారణలో నిందితురాలు అంగీకరించింది. డిఎన్ఎ టెస్ట్లో మృతుడి పంటి భాగాన్ని నిర్ధారించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







