బాయ్ఫ్రెండ్ దారుణ హత్య
- November 21, 2018
యూఏఈ: మొరాకో మహిళ, తన మాజీ బాయ్ఫ్రెండ్ని అతి కిరాతకంగా హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి, కొంత భాగాన్ని వంట చేసి, ఆ వంటకాన్ని తన ఇంటి సమీపంలో వున్న కన్స్ట్రక్షన్ కార్మికులకు వడ్డించింది. ఈ కేసు విచారణ శరవేగంగా జరుగుతోందిప్పుడు. మృతుడి ఆచూకీ కోసం అతని సోదరుడు ప్రయత్నించడంతో ఈ కేసు వెలుగు చూసింది. తన సోదరుడి గురించి, నిందితురాల్ని మృతుడి సోదరుడు ఆరా తీయగా, ఆమె తనకేమీ తెలియదని చెప్పింది. తాము విడిపోయామని తెలిపింది. అయితే, ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా కన్పించిన ఓ వస్తువు నేపథ్యంలో పోలీసులకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు, నిందితురాలు చేసిన నిర్వాకం తెలిసింది. బాయ్ఫ్రెండ్ మృతదేహాన్ని ముక్కలు చేసిన అనంతరం, స్నేహితురాలితో మొత్తం ఇంటిని క్లీన్ చేయించినట్లు విచారణలో నిందితురాలు అంగీకరించింది. డిఎన్ఎ టెస్ట్లో మృతుడి పంటి భాగాన్ని నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







