దుబాయ్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జన్సీ ఎక్సర్సైజ్
- November 21, 2018
దుబాయ్ ఎయిర్పోర్ట్స్, ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి - ఎమిరేట్ రెండో ఎయిర్ పోర్ట్) వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎమర్జన్సీ రెస్పాన్స్ కేపబిలిటీస్ని పరీక్షించేందుకోసం ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో కలిసి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎక్సర్సైజ్ జరుగుతున్న సమయంలో దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో యధావిధిగా ఇతర కార్యకలాపాలు నడుస్తాయి. దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ అనేది మెయిన్ పార్ట్. 2013లో ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా, కొంతవరకు మాత్రమే ప్రయాణీకులకు ఇది సేవలు అందించగలుగుతోంది. అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్, థర్డ్ క్వార్టర్లో 26 శాతం వృద్ధితో 119,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







