దుబాయ్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జన్సీ ఎక్సర్సైజ్
- November 21, 2018
దుబాయ్ ఎయిర్పోర్ట్స్, ఎమర్జన్సీ ఎక్సర్సైజ్ని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి - ఎమిరేట్ రెండో ఎయిర్ పోర్ట్) వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎమర్జన్సీ రెస్పాన్స్ కేపబిలిటీస్ని పరీక్షించేందుకోసం ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో కలిసి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎక్సర్సైజ్ జరుగుతున్న సమయంలో దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో యధావిధిగా ఇతర కార్యకలాపాలు నడుస్తాయి. దుబాయ్ వరల్డ్ సెంట్రల్లో అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ అనేది మెయిన్ పార్ట్. 2013లో ఈ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా, కొంతవరకు మాత్రమే ప్రయాణీకులకు ఇది సేవలు అందించగలుగుతోంది. అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్, థర్డ్ క్వార్టర్లో 26 శాతం వృద్ధితో 119,000 మంది ప్రయాణీకులకు సేవలందించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







