15 సెకెండ్స్లోనే యూఏఈ ఎంట్రీ పర్మిట్
- November 21, 2018
యూ.ఏ.ఈ:ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కేవలం 15 సెకెండ్లలోనే ఎంట్రీ పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకునే అవకాశం కలుగుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) వెల్లడించింది. కొత్త స్మార్ట్ సిస్టమ్ ద్వారా 5 మిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ టైమ్లో పూర్తి చేయగలదని అధికారులు వివరించారు. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, అప్లికెంట్స్ అథారిటీకి చెందిన స్మార్ట్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ వెంటనే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి, అక్కడికక్కడే వీసాల్ని మంజూరు చేస్తుంది. ఏడాదిగా ఈ సిస్టమ్ని తాము పరీక్షిస్తున్నామనీ, పూర్తిస్థాయి యాక్యురసీతో ఈ సిస్టమ్ పనిచేసిందని అధికారులు వివరించారు. మెడికల్ సర్టిఫికెట్ బేస్డ్ రికార్డ్స్ని చెక్ చేయడానికి గతంలో 4 నుంచి 6 గంటల సమయం పట్టేదనీ, అది ఇప్పుడు కేవలం 15 సెకెండ్లలో పూర్తయిపోతుందని కల్నల్ డాక్టర్ ఒమర్ అలి సయీద్ అల్ షామ్సి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







