దుబాయ్:టీ10 క్రికెట్ లీగ్ లో సందడి చేయనున్న ఊర్వశి రౌతెలా

- November 21, 2018 , by Maagulf
దుబాయ్:టీ10 క్రికెట్ లీగ్ లో సందడి చేయనున్న ఊర్వశి రౌతెలా

దుబాయ్‌లో టీ10 క్రికెట్‌ లీగ్‌ ప్రారంభోత్సవంలో 2015 మిస్ దివా, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా సందడి చేయబోతోంది. దీనికి పారితోషికంగా ఆమె రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్‌లో చాలా మంది షాక్ అవుతున్నారు. దుబాయ్‌ పార్క్‌ అండ్‌ రిసార్ట్స్‌లో లీగ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఊర్వశితోపాటు ప్రముఖ గాయకుడు ఆతిఫ్‌ అస్లామ్‌, నటి మహీరా ఖాన్‌ కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక షో చూడాలనుకుంటే రూ.2 వేలు పెట్టి టికెట్టు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com