విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళే భారతీయులకు న్యూ రూల్‌

- November 22, 2018 , by Maagulf
విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళే భారతీయులకు న్యూ రూల్‌

యూఏఈకి ఉపాధి కోసం వెళ్ళాలనుకునే భారతీయులకి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ కొత్త రూల్‌ని పాస్‌ చేసింది భారత ప్రభుత్వం. ఎంప్లాయిమెంట్‌ వీసా వుంటే, యూఏఈ సహా 18 దేశాల్లో భారతీయులకు ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ అవసరం లేదు. అయితే, ఇకపై 24 గంటలలోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే, ఇకపై ఆ పద్ధెనిమిది దేశాలకు వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇండియన్‌ ఇమ్మిగ్రెంట్స్‌కి రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యూఏఈ, ఒమన్‌, కతార్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, కువైట్‌, యెమెన్‌, ఇరాక్‌, జోర్డాన్‌, లెబనాన్‌, సౌత్‌ సుడాన్‌, సిరియా, థాయిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ ఇండోనేసియాతదితర దేశాలకు వెళ్ళే భారతీయులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com