హత్య కేసులో నిందితురాలి వాదన ఇదే!
- November 23, 2018
అల్ అయిన్:అల్ అయిన్లో ఓ మహిళ, తన మాజీ లవర్ని హత్య చేసి, అతని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి, వాటితో బిర్యానీ వండి.. తన ఇంటి పక్కనే ఓ భవన నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులకు వడ్డించిందంటూ ఓ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే, పోలీసులు 'వండి వడ్డించడం' అనే అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవనీ, దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. మరో వైపున ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితురాలు, విచారణ సందర్భంగా తొలుత తన మాజీ బాయ్ఫ్రెండ్ తన మీద దాడికి దిగాడని నిందితురాలి తరఫు లాయర్ పేర్కొన్నారు. బాయ్ఫ్రెండ్ దాడి కారణంగా, ఆందోళన చెందిన ఆ మహిళ తనకు అందుబాటులో వున్న కత్తితో, బాయ్ఫ్రెండ్పై ఎదురుదాడి చేసిందనీ, దాంతో కుప్పకూలిన ఆ వ్యక్తిని చూసి షాక్కి గురైన ఆ మహిళ ఆ తర్వాత తేరుకుని, మృతదేహాన్ని ముక్కలుగా కోసిందని విచారణలో తేలింది. బాయ్ఫ్రెండ్తో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







