హత్య కేసులో నిందితురాలి వాదన ఇదే!
- November 23, 2018అల్ అయిన్:అల్ అయిన్లో ఓ మహిళ, తన మాజీ లవర్ని హత్య చేసి, అతని శరీర భాగాల్ని ముక్కలుగా కోసి, వాటితో బిర్యానీ వండి.. తన ఇంటి పక్కనే ఓ భవన నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులకు వడ్డించిందంటూ ఓ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. అయితే, పోలీసులు 'వండి వడ్డించడం' అనే అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవనీ, దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని, ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. మరో వైపున ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితురాలు, విచారణ సందర్భంగా తొలుత తన మాజీ బాయ్ఫ్రెండ్ తన మీద దాడికి దిగాడని నిందితురాలి తరఫు లాయర్ పేర్కొన్నారు. బాయ్ఫ్రెండ్ దాడి కారణంగా, ఆందోళన చెందిన ఆ మహిళ తనకు అందుబాటులో వున్న కత్తితో, బాయ్ఫ్రెండ్పై ఎదురుదాడి చేసిందనీ, దాంతో కుప్పకూలిన ఆ వ్యక్తిని చూసి షాక్కి గురైన ఆ మహిళ ఆ తర్వాత తేరుకుని, మృతదేహాన్ని ముక్కలుగా కోసిందని విచారణలో తేలింది. బాయ్ఫ్రెండ్తో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!