క్రికెట్ మ్యాచ్లో గొడవ.. కాల్పుల్లో 7 మంది మృతి
- November 24, 2018
ఖైబర్: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు తీవ్ర హింసగా మారింది. ఆ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో జరిగింది. అబోటాబాద్ జిల్లాలోని ఓ పోలీసు పోస్టు వద్ద రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఆ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. అక్కడ రెండు వర్గాలకు చెందిన వారు ఆయుధాలతోనే పోలీసు స్టేషన్కు వచ్చారు. ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..