'పేటా' ఆడియో కు ముహూర్తం ఫిక్స్ !
- November 24, 2018
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్టా' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రజనీ సరసన త్రిష జతకట్టనుంది. మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ నటిస్తున్నారు. ఇందులో విజయ్సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా 'పేట్టా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సినిమా ఆడియో వేడుకని ప్లాన్ చేశారు. అంతకంతే ముందే రెండు పాటలని విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 3 ఒకటి, డిసెంబర్ 7న మరో పాటని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీ 2.ఓ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







