ఇండోనేషియా:భారత పైలెట్ మృతదేహం లభ్యం
- November 25, 2018
ఇండోనేషియా:గతనెల 29న ఇండొనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన భారత పైలెట్ భవ్యే సునేజా మృత దేహం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అక్కడి అధికారులు పైలెట్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందచేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. భవ్వే సునేజా మరణంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. గత నెలలో జకార్తా నుంచి బ్యాంగ్ కా ద్వీపానికి వెళుతున్న లయన్ ఎయిర్ కు చెందిన విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 189 మంది ప్రయాణికులు మరణించగా, ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల భవ్యే సునేజా విమాన పైలెట్ గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







