ఇండోనేషియా:భారత పైలెట్ మృతదేహం లభ్యం
- November 25, 2018
ఇండోనేషియా:గతనెల 29న ఇండొనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన భారత పైలెట్ భవ్యే సునేజా మృత దేహం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అక్కడి అధికారులు పైలెట్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందచేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. భవ్వే సునేజా మరణంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. గత నెలలో జకార్తా నుంచి బ్యాంగ్ కా ద్వీపానికి వెళుతున్న లయన్ ఎయిర్ కు చెందిన విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 189 మంది ప్రయాణికులు మరణించగా, ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల భవ్యే సునేజా విమాన పైలెట్ గా వ్యవహరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!