మణిరత్నం కొత్త సినిమా కబర్
- November 25, 2018
మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..'ఓకే బంగారం'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన 'కాట్రు వెలియిదాయ్' చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. 'చెక్క చివంద వానమ్' (తెలుగులో 'నవాబ్') తో మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మణిరత్నం తదుపరి సినిమా ఉండబోతుందని సమాచారమ్. ఇదీకూడా మల్టీస్టారర్ సినిమాయే అని చెబుతున్నారు. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారంట మణి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, తెలుగు హీరోల్లో రామ్ చరణ్, నానిలతో మణిరత్నం సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఓకే బంగారం రామ్ చరణ్ తో అనుకొన్నారు. ఆ కథ చరణ్ కి సూటవ్వదని భావించిన మణిరత్నం సల్మాన్ దుల్కర్ తో కానిచ్చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు







