మణిరత్నం కొత్త సినిమా కబర్
- November 25, 2018
మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..'ఓకే బంగారం'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన 'కాట్రు వెలియిదాయ్' చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. 'చెక్క చివంద వానమ్' (తెలుగులో 'నవాబ్') తో మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మణిరత్నం తదుపరి సినిమా ఉండబోతుందని సమాచారమ్. ఇదీకూడా మల్టీస్టారర్ సినిమాయే అని చెబుతున్నారు. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారంట మణి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, తెలుగు హీరోల్లో రామ్ చరణ్, నానిలతో మణిరత్నం సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఓకే బంగారం రామ్ చరణ్ తో అనుకొన్నారు. ఆ కథ చరణ్ కి సూటవ్వదని భావించిన మణిరత్నం సల్మాన్ దుల్కర్ తో కానిచ్చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









