మణిరత్నం కొత్త సినిమా కబర్
- November 25, 2018
మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..'ఓకే బంగారం'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన 'కాట్రు వెలియిదాయ్' చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. 'చెక్క చివంద వానమ్' (తెలుగులో 'నవాబ్') తో మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మణిరత్నం తదుపరి సినిమా ఉండబోతుందని సమాచారమ్. ఇదీకూడా మల్టీస్టారర్ సినిమాయే అని చెబుతున్నారు. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారంట మణి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, తెలుగు హీరోల్లో రామ్ చరణ్, నానిలతో మణిరత్నం సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఓకే బంగారం రామ్ చరణ్ తో అనుకొన్నారు. ఆ కథ చరణ్ కి సూటవ్వదని భావించిన మణిరత్నం సల్మాన్ దుల్కర్ తో కానిచ్చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







