కువైట్, ఇరాక్లో కంపించిన భూమి
- November 26, 2018
రాన్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని ప్రభావం భాగ్దాద్, కువైట్లలో కూడా కనిపించింది. భూకంపం సంభవించడంతో 200 నుంచి 210 మంది వరకు తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అయితే భూకంపం ఘటనలో ఎవరూ మృతిచెందలేదని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. భూకంపం ధాటికి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో పరుగులు తీస్తుండగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే భూకంపం తర్వాత వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో విద్యుత్ను తిరిగి పునరుద్ధరించినట్లు చెప్పారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగి పడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇరాక్తో సరిహద్దు నగరంగా ఉన్న ఇరాన్ నగరం ఇలామ్కు ఈశాన్య దిశలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రావిన్స్లోని ఏడు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా కెర్మాన్షా ప్రాంతంలో కనిపించింది. గతేడాది ఇక్కడ భూకంపం సంభవించడంతో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.
భూకంపం ప్రభావం ఇటు కువైట్లో కూడా స్పష్టంగా కనిపించింది. భూమి కంపించినట్లు అనిపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇక్కడ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అంతా సర్దుకుందని అధికారులు ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







