నేషనల్ డే: 205 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 26, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 205 ప్రిజనర్స్కి యూఏఈ 47వ నేషనల్ డే, కమ్మెమరేషన్ డే సందర్భంగా క్షమాభిక్ష ఇచ్చారు. పలు రకాల కేసులకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఇది పెద్ద ఊరటగా పలువురు అభివర్ణిస్తున్నారు. గుడ్ కండక్ట్ని పరిగణనలోకి తీసుకుని ఆయా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపుతుంది. ఈ సందర్భంగా షేక్ సౌద్కి రస్ అల్ ఖైమా అటార్నీ జనరల్కి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, పలు సూచనలు చేశారు. క్షమాభిక్షకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో హసన్ సయీద్ ముహమ్మద్, షేక్ సౌద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు, సమాజంలో మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







