నేషనల్ డే: 205 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 26, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 205 ప్రిజనర్స్కి యూఏఈ 47వ నేషనల్ డే, కమ్మెమరేషన్ డే సందర్భంగా క్షమాభిక్ష ఇచ్చారు. పలు రకాల కేసులకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఇది పెద్ద ఊరటగా పలువురు అభివర్ణిస్తున్నారు. గుడ్ కండక్ట్ని పరిగణనలోకి తీసుకుని ఆయా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపుతుంది. ఈ సందర్భంగా షేక్ సౌద్కి రస్ అల్ ఖైమా అటార్నీ జనరల్కి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, పలు సూచనలు చేశారు. క్షమాభిక్షకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో హసన్ సయీద్ ముహమ్మద్, షేక్ సౌద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు, సమాజంలో మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







