నేషనల్ డే: 205 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 26, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 205 ప్రిజనర్స్కి యూఏఈ 47వ నేషనల్ డే, కమ్మెమరేషన్ డే సందర్భంగా క్షమాభిక్ష ఇచ్చారు. పలు రకాల కేసులకు సంబంధించి శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలకు ఇది పెద్ద ఊరటగా పలువురు అభివర్ణిస్తున్నారు. గుడ్ కండక్ట్ని పరిగణనలోకి తీసుకుని ఆయా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపుతుంది. ఈ సందర్భంగా షేక్ సౌద్కి రస్ అల్ ఖైమా అటార్నీ జనరల్కి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, పలు సూచనలు చేశారు. క్షమాభిక్షకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో హసన్ సయీద్ ముహమ్మద్, షేక్ సౌద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు, సమాజంలో మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..