ఇసుకలో కూరుకుపోయిన వాహనం: దొంగల పట్టివేత
- November 26, 2018
యూ.ఏ.ఈ:దొంగలు ప్రయాణిస్తున్న వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో ఆ దొంగలు పట్టుబడ్డారు. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కంపెనీ నుంచి బిల్డింగ్ మెటీరియల్స్ని దొంగిలించిన నిందితులు, ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అనంతరం దొంగిలించిన మెటీరియల్తో వాహనంలో పారిపోతుండగా, వారి వాహనం ఇసుకలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని ఇసుకలో వదిలేసి నిందితులు పారిపోయారు. మార్చి 21న ఈ దొంగతనం జరిగింది. దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్ని ఆసుపత్రిలో విచారించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఆదివారం జరిగిన హియరింగ్లో నిందితులపై అభియోగాలు నిరూపించబడలేదు. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







