ఇసుకలో కూరుకుపోయిన వాహనం: దొంగల పట్టివేత

- November 26, 2018 , by Maagulf
ఇసుకలో కూరుకుపోయిన వాహనం: దొంగల పట్టివేత

యూ.ఏ.ఈ:దొంగలు ప్రయాణిస్తున్న వాహనం ఇసుకలో కూరుకుపోవడంతో ఆ దొంగలు పట్టుబడ్డారు. షార్జా ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ కంపెనీ నుంచి బిల్డింగ్‌ మెటీరియల్స్‌ని దొంగిలించిన నిందితులు, ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. అనంతరం దొంగిలించిన మెటీరియల్‌తో వాహనంలో పారిపోతుండగా, వారి వాహనం ఇసుకలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని ఇసుకలో వదిలేసి నిందితులు పారిపోయారు. మార్చి 21న ఈ దొంగతనం జరిగింది. దుండగుల దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్‌ని ఆసుపత్రిలో విచారించిన పోలీసులు, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అయితే ఆదివారం జరిగిన హియరింగ్‌లో నిందితులపై అభియోగాలు నిరూపించబడలేదు. కేసు తదుపరి విచారణను డిసెంబర్‌ 12వ తేదీకి వాయిదా వేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com