26/11 ముంబై ఎటాక్: ఒమన్లో అమరులకు నివాళి
- November 27, 2018
మస్కట్: 2008 నవంబర్ 28న భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోయినవారికి మస్కట్లో నివాళులర్పించారు ఇక్కడ సెటిలైన ముంబైకి చెందినవారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి ఆ ఘటనలో 174 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. 10 మంది తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 9 మంది తీవ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టగా, సజీవంగా పోలీసులకు చిక్కిన కసబ్పై నేరాభియోగాలు నిరూపించి, చట్ట ప్రకారం ఉరితీశారు. ఆనాటి ఆ ఘటనను తలచుకుంటూ, ఆ ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులు ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







