డ్రైవింగ్ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్ల జరిమానా
- November 27, 2018
దుబాయ్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫొటోలు తీస్తే, క్షణాల్లో పరిస్థితులు విపరీతంగా మారొచ్చు. అందుకే భారీ జరిమాణాలతో ఈ తరహా ఉల్లంఘనలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - దుబాయ్, మోటరిస్టులకు ఈ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు దిగినా, ఫొటోలు తీసినా 800 దిర్హామ్ల జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ విధించనున్నట్లు పేర్కొంది ఆర్టిఎ. ఫోన్లలో ఫొటోలు తీయడం ద్వారా రియాక్షన్ టైమ్ తగ్గిపోతుందని ఆర్టిఎ వివరించింది. ఒక్క సెకెన్లో రోడ్డు మీద పరిస్థితులు మారిపోతాయనీ, అలా చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశంతోపాటు, తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందని వాహనదారుల్ని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







