డ్రైవింగ్ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్ల జరిమానా
- November 27, 2018
దుబాయ్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫొటోలు తీస్తే, క్షణాల్లో పరిస్థితులు విపరీతంగా మారొచ్చు. అందుకే భారీ జరిమాణాలతో ఈ తరహా ఉల్లంఘనలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - దుబాయ్, మోటరిస్టులకు ఈ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు దిగినా, ఫొటోలు తీసినా 800 దిర్హామ్ల జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ విధించనున్నట్లు పేర్కొంది ఆర్టిఎ. ఫోన్లలో ఫొటోలు తీయడం ద్వారా రియాక్షన్ టైమ్ తగ్గిపోతుందని ఆర్టిఎ వివరించింది. ఒక్క సెకెన్లో రోడ్డు మీద పరిస్థితులు మారిపోతాయనీ, అలా చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశంతోపాటు, తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందని వాహనదారుల్ని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







