డ్రైవింగ్ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్ల జరిమానా
- November 27, 2018
దుబాయ్: డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫొటోలు తీస్తే, క్షణాల్లో పరిస్థితులు విపరీతంగా మారొచ్చు. అందుకే భారీ జరిమాణాలతో ఈ తరహా ఉల్లంఘనలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - దుబాయ్, మోటరిస్టులకు ఈ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీలు దిగినా, ఫొటోలు తీసినా 800 దిర్హామ్ల జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్స్ విధించనున్నట్లు పేర్కొంది ఆర్టిఎ. ఫోన్లలో ఫొటోలు తీయడం ద్వారా రియాక్షన్ టైమ్ తగ్గిపోతుందని ఆర్టిఎ వివరించింది. ఒక్క సెకెన్లో రోడ్డు మీద పరిస్థితులు మారిపోతాయనీ, అలా చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశంతోపాటు, తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందని వాహనదారుల్ని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







