సరిహద్దు దాటిన సిద్ధూ
- November 27, 2018
మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోతిసింగ్ సిద్ధూ అత్తారి -వాఘా సరిహద్దు దాటి పాకిస్తాన్ లో అడుగుపెట్టారు. ఆయన నవంబర్ 28న కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. కర్తార్ పూర్ కారిడార్ భారత్-పాకిస్థాన్ మధ్య మరో చరిత్రాత్మక ఘట్టం కానుంది. పాకిస్థాన్లోని కర్తార్పుర్ గురుద్వారాకు భారత్ సరిహద్దుల్లోని డేరాబాబానానక్ నుంచి ఫోర్ లేన్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆయన పర్యటనకు కేంద్రంలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సిద్ధూను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మమద్ ఖురేషీ సరిహద్దు వద్ద సాదరంగా ఆహ్వానించారు.
కర్తార్ పూర్ నుంచి కారిడార్ కు పాకిస్తాన్ తరఫున పునాధిరాయి బుధవారం ఇమ్రాన్ ఖాన్ వేయనున్నారు. ఈ కారిడార్ వల్ల భారత్ నుంచి సిక్కులు తమ పవిత్ర స్థలం గురుద్వారాకు సులభంగా చేరుకోవచ్చు. మొట్టమొదటి సిక్కు గురువు గురునానక్ 18 ఏళ్ల నుంచి ఆయన మరణం వరకు ఇక్కడే నివాసించారని సిక్కుల విశ్వాసం . ఈ కారిడార్ భారత్ లోని గురదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి ప్రారంభం అవుతుంది. గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్ పూర్ పాకిస్తాన్ లోని రావి నది ఒడ్డున ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







