తాలిబన్తో చర్చలకు 12మందితో బృందం
- November 28, 2018
కాబూల్: తాలిబన్తో శాంతి చర్చలు జరిపేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం 12మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జెనీవాలో బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో అనేక మాసాలు పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత శాంతి చర్చలకు ఒక ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. మహిళలతో సహా పౌరుల రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులు పరిరక్షించబడతాయని ఆయన హామీ ఇచ్చారు. అధ్యక్ష భవన కార్యాలయ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సల్మాన్ రహిమి నేతృత్వంలో ఈ బృందం చర్చలు జరుపుతుంది. ఈ బృందంలో మహిళలు, పురుషులు వున్నారు. తీవ్రవాద నెట్వర్క్లతో సంబంధాలు కలిగిన ఏ సంస్థను రాజకీయక్రమంలో చేరేందుకు అనుమతించేది లేదని ఘని స్పష్టం చేశారు. కాగా చర్చలకు ముందు షరతుగా అంతర్జాతీయ బలగాలు వైదొలగాలని తాలిబన్ డిమాండ్ చేస్తోంది. శాంతి క్రమాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నెల ఆరంభంలో తాలిబన్ అధికారులు అమెరికా ప్రత్యేక ప్రతినిధితో మూడు రోజుల పాటు చర్చలు జరిపారు.ఈ చర్చల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







