ఎస్‌ఎంఎస్‌ స్కామ్‌: ఐదుగురు వలసదారుల అరెస్ట్‌

- November 29, 2018 , by Maagulf
ఎస్‌ఎంఎస్‌ స్కామ్‌: ఐదుగురు వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ఎస్‌ఎంఎస్‌ స్కామ్‌కి సంబంధించి ఐదుగురు వలసదారుల్ని సౌత్‌ బతినాలో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. వీరిపై ఎలక్ట్రానిక్‌ ఫ్రాడ్‌ కింద కేసులు నమోదు చేశారు. భారీ మొత్తాల్లో నగదును బహుమతిగా గెల్చుకున్నారంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అమాయకుల్ని మోసగిస్తున్నారు నిందితులు. జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ - సౌత్‌ బతినా గవర్నరేట్‌ నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. సిటిజన్స్‌, రెసిడెంట్స్‌ ఇలాంటి ఫ్రాడ్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, నగదు గెల్చుకున్నారంటూ వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను నమ్మరాదని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com