యూఏఈ - ముంబై మధ్య అండర్ వాటర్ రైల్ ట్రావెల్.?
- November 29, 2018
ఇన్నోవేషన్స్కి పెట్టింది పేరుగా యూఏఈలో అనేక ఆవిష్కరణలు ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెల్సిందే. హైపర్లూప్ ప్రాజెక్ట్, ఫ్లయ్యింగ్ కార్స్ విషయంలో యూఏఈ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి మరో అద్భుతం సాక్షాత్కారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలోనే వున్నా, ఈ ప్రాజెక్ట్కి తుది రూపు వస్తే అది ఓ అద్భుతమే కాబోతోంది. భారతదేశంలోని ముంబైనీ, యూఏఈలోని ఫుజారియానీ కలిపే అండర్ వాటర్ రైల్ నెట్ వర్క్ దిశగా ఓ ఆలోచన తెరపైకొచ్చింది. నేషనల్ అడ్వయిసర్ బ్యూరో లిమిటెడ్ - మస్దార్ - ఫౌండర్ అలషెహ్హి ఈ ఆలోచన చేశారు. ఈ ప్రాజెక్ట్ గనుక వాస్తవ రూపం దాల్చితే, ఇండియా - యూఏఈతో పాటు పలు దేశాలకు ఎంతో లబ్ది చేకూర్చుతుందని అన్నారాయన. ఇది ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్ మాత్రమేనని ఆయన అంటున్నారు. ప్రయాణీకుల రవాణా కోసమే కాక, సరుకు రవాణా కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ చేపట్టవలసి వుంది. రష్యా, కెనడా, అమెరికాతో కనెక్ట్ అవడానికి చైనా ఇలాంటి ఆలోచనలే చేస్తోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..