యూఏఈ - ముంబై మధ్య అండర్ వాటర్ రైల్ ట్రావెల్.?
- November 29, 2018
ఇన్నోవేషన్స్కి పెట్టింది పేరుగా యూఏఈలో అనేక ఆవిష్కరణలు ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెల్సిందే. హైపర్లూప్ ప్రాజెక్ట్, ఫ్లయ్యింగ్ కార్స్ విషయంలో యూఏఈ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి మరో అద్భుతం సాక్షాత్కారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలోనే వున్నా, ఈ ప్రాజెక్ట్కి తుది రూపు వస్తే అది ఓ అద్భుతమే కాబోతోంది. భారతదేశంలోని ముంబైనీ, యూఏఈలోని ఫుజారియానీ కలిపే అండర్ వాటర్ రైల్ నెట్ వర్క్ దిశగా ఓ ఆలోచన తెరపైకొచ్చింది. నేషనల్ అడ్వయిసర్ బ్యూరో లిమిటెడ్ - మస్దార్ - ఫౌండర్ అలషెహ్హి ఈ ఆలోచన చేశారు. ఈ ప్రాజెక్ట్ గనుక వాస్తవ రూపం దాల్చితే, ఇండియా - యూఏఈతో పాటు పలు దేశాలకు ఎంతో లబ్ది చేకూర్చుతుందని అన్నారాయన. ఇది ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్ మాత్రమేనని ఆయన అంటున్నారు. ప్రయాణీకుల రవాణా కోసమే కాక, సరుకు రవాణా కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ చేపట్టవలసి వుంది. రష్యా, కెనడా, అమెరికాతో కనెక్ట్ అవడానికి చైనా ఇలాంటి ఆలోచనలే చేస్తోంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









