12 వేల వెబ్సైట్స్ బ్లాక్..!!
- November 29, 2018
చెన్నై:రిలీజ్ కంటే ముందే ఎంత పెద్ద సినిమా అయినా సోషల్ మీడియాలో లీకైపోతుంది. నిమిషాల్లో పైరసీగా మార్చేస్తున్నారు. వెబ్సైట్స్లో అప్ లోడ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ దాదాపు 500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన రజనీకాంత్ 2.0 చిత్రాన్ని కూడా ఎక్కడ చోరీ చేస్తారోనని ముందుగా చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హై కోర్టులో పిటీషన్ వేసింది. పైరసీ భూతం చిత్ర యూనిట్ని భయాందోళనకు గురిచేస్తోంది.
పిటీషన్ని స్వీకరించిన జస్టిస్ ఎం సుందర్ పైరసీ చేస్తున్న 12000 వెబ్సైట్స్ని బ్లాక్ చేయమని 37 ఇంటర్నెట్ ప్రొవైడర్లకి ఆదేశించారు. దీనిలో 2,000 కంటే ఎక్కువ వెబ్ సైట్స్ తమిళ్ రాకర్స్ చేత నిర్వహించబడుతున్నాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పది వేలకి పైగా స్క్రీన్స్లో విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంశలందుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







