యూ.ఏ.ఈ:రేపటితో ముగియనున్న ఆమ్నెస్టీ
- November 29, 2018యూ.ఏ.ఈ:నవంబర్ 30వ తేదీతో అమ్నెస్టీ ముగుస్తుందనీ, ఎలాంటి పొడిగింపులూ లేవని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) స్పష్టం చేసింది. ఆమ్నెస్టీ ముగిసిన వెంటనే, దేశమంతటా ఎక్కడికక్కడ స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించి, అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఆమ్నెస్టీని వినియోగించుకోవాలని అధికారులు గుర్తు చేస్తున్నారు. 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అమ్నెస్టీని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే మరో నెలరోజులపాటు ఆమ్నెస్టీని పొడిగించారు. ఆ గడువు కూడా రేపటితో ముగియనుండడంతో అధికారులు, అక్రమ నివాసితుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమ్నెస్టీ పీరియడ్లో కొందరు తమ స్టేటస్ని సరిదిద్దుకుంటే, మరికొందరు దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..