ఢిల్లీ, చెన్నైలో.. భారీగా హవాల డబ్బు స్వాధీనం
- December 03, 2018
ఢిల్లీలో భారీ హవాలా రాకెట్ను చేధించింది ఐటీ శాఖ. లాకర్లలో దాచిన 25 కోట్ల రూపాయలను బయటికి తీసింది. ఈ సొమ్మంతా హవాలా సొమ్ముగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఓప్రైవేట్ సంస్థలో పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము ఉందనే పక్కా సమాచారంతో రంగంలో దిగారు ఐటీ అధికారులు. చాందినీ చౌక్ సహా 8 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఈ డబ్బును గుర్తించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన పొగాకు, రసాయనిక, డ్రైఫూట్ డీలర్లు పన్ను ఎగవేత ద్వారా ఆ డబ్బును దాచుకొని ఉంటారని సమాచారం.
ఢిల్లీలో ఇంత పెద్ద స్థాయిలో డబ్బు దొరకడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జనవరిలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో 40 కోట్ల సొమ్ము బయటపడింది. మరో సందర్భంలో ఈడీ దాడుల్లో 700 కోట్లు బయటపడింది. దుబాయ్ హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్కు ఈ హవాలా సొమ్ముతో సంబంధమున్నట్లు వెలుగుచూసింది.
అటు.. చెన్నైలోనూ 11కోట్ల నగదు, 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ పారిశ్రామికవేత్త కు చెందిన హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకుంటున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో DRI పోలీసులు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. సెంట్రల్ చెన్నైలోని హోటల్లో సోదాలు నిర్వహించి 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా డబ్బు సీజ్ చేశారు.
హవాలా సొమ్ము కోసం ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు.. అతని బ్యాగ్లో కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకున్నట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమచారంతో.. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..