ఢిల్లీ, చెన్నైలో.. భారీగా హవాల డబ్బు స్వాధీనం
- December 03, 2018
ఢిల్లీలో భారీ హవాలా రాకెట్ను చేధించింది ఐటీ శాఖ. లాకర్లలో దాచిన 25 కోట్ల రూపాయలను బయటికి తీసింది. ఈ సొమ్మంతా హవాలా సొమ్ముగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఓప్రైవేట్ సంస్థలో పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము ఉందనే పక్కా సమాచారంతో రంగంలో దిగారు ఐటీ అధికారులు. చాందినీ చౌక్ సహా 8 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఈ డబ్బును గుర్తించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన పొగాకు, రసాయనిక, డ్రైఫూట్ డీలర్లు పన్ను ఎగవేత ద్వారా ఆ డబ్బును దాచుకొని ఉంటారని సమాచారం.
ఢిల్లీలో ఇంత పెద్ద స్థాయిలో డబ్బు దొరకడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జనవరిలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో 40 కోట్ల సొమ్ము బయటపడింది. మరో సందర్భంలో ఈడీ దాడుల్లో 700 కోట్లు బయటపడింది. దుబాయ్ హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్కు ఈ హవాలా సొమ్ముతో సంబంధమున్నట్లు వెలుగుచూసింది.
అటు.. చెన్నైలోనూ 11కోట్ల నగదు, 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ పారిశ్రామికవేత్త కు చెందిన హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకుంటున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో DRI పోలీసులు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. సెంట్రల్ చెన్నైలోని హోటల్లో సోదాలు నిర్వహించి 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా డబ్బు సీజ్ చేశారు.
హవాలా సొమ్ము కోసం ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు.. అతని బ్యాగ్లో కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకున్నట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమచారంతో.. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







