యూఏఈ వీసా ఆమ్నెస్టీ నెల రోజుల పొడిగింపు
- December 03, 2018
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఆమ్నెస్టీ స్కీమ్ని నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ 31 వరకు అమ్నెస్టీ పొడిగించినట్లయ్యింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి సమస్యలు ఎదుర్కొంటున్న వలసదారులకు ఆమ్నెస్టీ స్కీమ్ ఎంత ఊరటనిస్తోంది. గతంలో ఓ సారి నెల రోజులపాటు పొడిగింపబడిన ఈ స్కీమ్, తాజాగా మరో నెల పొడిగించడంతో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొడిగింపు నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్ఎఐసి పేర్కొంది. 'మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో మూడు నెలలపాటు తొలుత ఆమ్నెస్టీని ప్రకటించారు. ఆగప్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దీన్ని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత నవంబర్ 30 వరకూ పొడిగించగా, ఇప్పుడు అది డిసెంబర్ 31 వరకు పొడిగించడమయ్యింది.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







