యూఏఈ వీసా ఆమ్నెస్టీ నెల రోజుల పొడిగింపు
- December 03, 2018
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఆమ్నెస్టీ స్కీమ్ని నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిసెంబర్ 31 వరకు అమ్నెస్టీ పొడిగించినట్లయ్యింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి సమస్యలు ఎదుర్కొంటున్న వలసదారులకు ఆమ్నెస్టీ స్కీమ్ ఎంత ఊరటనిస్తోంది. గతంలో ఓ సారి నెల రోజులపాటు పొడిగింపబడిన ఈ స్కీమ్, తాజాగా మరో నెల పొడిగించడంతో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొడిగింపు నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్ఎఐసి పేర్కొంది. 'మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో మూడు నెలలపాటు తొలుత ఆమ్నెస్టీని ప్రకటించారు. ఆగప్ట్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు దీన్ని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత నవంబర్ 30 వరకూ పొడిగించగా, ఇప్పుడు అది డిసెంబర్ 31 వరకు పొడిగించడమయ్యింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







