2.ఓ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూల్..
- December 03, 2018
సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సుప్రీం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కిన మూవీ 2.ఓ . గతనెల 29న విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. మొదటిరోజే 150 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క హిందీ, తమిళ్ లోనే ఈ సినిమా 250 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఆంధ్ర, నైజాం కలిపి 50 కోట్లు పైగానే వసూళ్లు రాబట్టింది. కర్ణాటక, కేరళలో తొలి రోజు షేర్ రూ.8 కోట్లు సాధించింది. రెండో రోజు రూ.4 కోట్లు వసూలు చేసింది. కేరళ విషయానికి వస్తే ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.5.10 కోట్లు షేర్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా విడుదలైన రెండో రోజు ఆశించినంతగా వసూళ్లు రాకపోవడంతో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. మూడో రోజు వసూళ్లు బాగానే ఉండటంతో పాటు నాలుగో రోజు ఆదివారం కూడా కావడంతో భారీ వసూళ్లు సాధించింది. దాంతో 400 కోట్ల క్లబ్ లో చేరింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







