హైదరాబాద్ లో మోడీ బహిరంగ సభ
- December 03, 2018
హైదరాబాద్: ఈనెల 7 వ తేదీ తర్వాత రాష్ట్రంలో వారసత్వ కుటుంబ పార్టీలు కనుమరుగవుతాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధుల విజయంకోసం ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ...దేశంలో వారసత్వ కుటుంబ పాలన లేని ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. దేశంలో ఒక ప్రధాన పార్టీ ఐన కాంగ్రెస్ ఒక కుటుంబం చేతిలో చిక్కుకుని ఉందని, ఆపార్టీలో యోగ్యులైన వారు ఎందరో ఉన్నా వారసత్వరాజకీయాల వల్ల ఎదగలేకపోయారని మోడీ అన్నారు. యోగ్యత లేకున్నా వారసత్వంగా పార్టీని ప్రభుత్వాన్ని నడపాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని మోడీ విమర్శించారు.
తెలంగాణా రాష్ట్రంలో కూడా కేసీఆర్ కుటుంబం చేతిలో టీఆర్ఎస్ పార్టీ బందీ అయిందని, ఏపీలో టీడీపీ కానీ హైదరాబాద్ లోని ఎంఐఎం కానీ అన్నీ వారసత్వ కుటుంబ పార్టీలేనని మోడీ చెప్పారు. ఎంఐఎం కుటుంబ వారసత్వంతోపాటు మతాన్నికూడా నమ్ముకుందని, ప్రజలు వారసత్వ పార్టీలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం,కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపిస్తే , చంద్రబాబునాయుడు స్వార్ధంకోసం కాంగ్రెస్ తో చేతులు కలిపారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని, రెండూ వ్యతిరేకంగా కనిపించినా ఆలోచనా విధానం ఒకటే అని మోడీ అన్నారు.
తెలంగాణా ప్రజలకు హృదయ పూర్వక అభినందనలు అంటూ తెలుగులో ప్రసంగాన్నిప్రారంభించిన మోడీ ....సర్దార్ వల్లభాయ్ పటేల్ నాకు ఆదర్శం అని, పటేల్ పట్టుదల,కృషి వల్లే హైదరాబాద్ విమోచనం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







