నైజీరియాలో ఉపాధ్యాయుల ఆందోళనలు

- December 04, 2018 , by Maagulf
నైజీరియాలో ఉపాధ్యాయుల ఆందోళనలు

బూజ : నైజీరియాలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సరిపడ నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన బాట పట్టాయి. దీంతో, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యా యులు తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉత్తర నైజీరియాలోని సొకోటో నగరంలో ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ తీశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు కోసం తామెంతో కృషి చేశామని పలువురు ఉపాధ్యా యులు తెలిపారు. అయితే, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో నిరుపేద విద్యార్థుల డ్రాపవుట్‌ పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com