నైజీరియాలో ఉపాధ్యాయుల ఆందోళనలు
- December 04, 2018
బూజ : నైజీరియాలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సరిపడ నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన బాట పట్టాయి. దీంతో, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యా యులు తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉత్తర నైజీరియాలోని సొకోటో నగరంలో ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ తీశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు కోసం తామెంతో కృషి చేశామని పలువురు ఉపాధ్యా యులు తెలిపారు. అయితే, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో నిరుపేద విద్యార్థుల డ్రాపవుట్ పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







