నైజీరియాలో ఉపాధ్యాయుల ఆందోళనలు
- December 04, 2018
బూజ : నైజీరియాలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సరిపడ నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన బాట పట్టాయి. దీంతో, యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యా యులు తరగతులు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉత్తర నైజీరియాలోని సొకోటో నగరంలో ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ తీశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించాలని, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు కోసం తామెంతో కృషి చేశామని పలువురు ఉపాధ్యా యులు తెలిపారు. అయితే, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో నిరుపేద విద్యార్థుల డ్రాపవుట్ పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









