డిసెంబర్ 7న ఎన్నికలు.. ఆ రోజుకు మరో ప్రత్యేకత ఏంటంటే..
- December 04, 2018
డిసెంబర్ 7వ తేదీ అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆరోజు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. పోలింగ్ రోజు శుక్రవారం కావడం ఆతరువాత రెండవ శనివారం,ఆదివారం సైతం తోడవడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అయితే కొంతమంది ఓటర్లు గురువారం రాత్రికే తమ సొంత ఊర్లకు పయనమవుతున్నట్టు సమాచారం. ఎందుకంటే పోలింగ్ రోజున ప్రయాణం చెయ్యాలంటే కుదరని పని. అందువల్ల ఆరవ తేదీ రాత్రికే పట్టణాల నుంచి పల్లెలకు పోతున్నారు. సాధారణంగా నిత్యం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 5 లక్షలకు పైనే ఉంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుండగా, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి మరో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. వరుస సెలవుల్లో 50 వేల మంది అదనంగా ప్రయాణాలు సాగిస్తారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి వేల సంఖ్యలో అదనంగా ప్రజలు అటు బస్సులు, ఇటు రైళ్లలో ప్రయాణం చేస్తారని ఎన్నికల కమిషన్ అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇదిలావుంటే ఈనెల 7వ తేదికి మరో ప్రత్యేకత ఉంది. అదే రోజు 6 సినిమాలు విడుదల అవుతున్నాయి. భైరవగీత, కవచం, నెక్ట్స్ ఏంటీ, సువర్ణ సుందరి, శుభలేఖ+లు, సుబ్రహ్మణ్యపురం తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వరుస సెలవులు కారణంగా ఈ సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే పోలింగ్ రోజు మినహాయిస్తే రెండురోజులూ ఈ సినిమాలకు కలెక్షన్లు భారీగానే ఉంటాయని నిర్మాతలు అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది అభిప్రాయం మరోలా ఉంది. ఎన్నికల సందర్బంగా వరుస సెలవులు ఉండటంతో ప్రజలు స్వస్థలాలకు వెళతారు కాబట్టి.. ఆ మూడు రోజులు కుటుంబసభ్యులతో హాయిగా గడపాలని అనుకుంటారు అని అంటున్నారు. మరి ప్రజలు ఎంటర్టైన్మెంటు కోసం సినిమాలకు వెళతారా.. మూడురోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఓటు వేసి హాయిగా కుటుంబసభ్యులతో వుండాలని కోరుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









