దిగ్విజయంగా జీశాట్ -11 ప్రయోగం
- December 05, 2018
జీశాట్ -11 ప్రయోగం విజయవంతమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బిగ్ బర్డ్గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లు ఇస్రో వెచ్చించింది.డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్-11 ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా.. తాజా ప్రయోగం మూడోది. ఈ శాటిలైట్ 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనున్న జీశాట్-11 శాటిలైట్ భారత్కు విలువైన అంతరిక్ష ఆస్తిగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







