దిగ్విజయంగా జీశాట్ -11 ప్రయోగం
- December 05, 2018
జీశాట్ -11 ప్రయోగం విజయవంతమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బిగ్ బర్డ్గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లు ఇస్రో వెచ్చించింది.డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్-11 ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా.. తాజా ప్రయోగం మూడోది. ఈ శాటిలైట్ 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనున్న జీశాట్-11 శాటిలైట్ భారత్కు విలువైన అంతరిక్ష ఆస్తిగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







