పోలీసుల అదుపులో ‘గోపిక’ నటి.. వజ్రాల వ్యాపారి..
- December 09, 2018
ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడా హత్య కేసులో పలువురు సినీ నటులను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాజాకీయ నాయకుడు సచిన్ పవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా సినీనటి దెవోలినా భట్టాచార్యను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఉడా కాగా గతవారం ఇంటినుంచి కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు రాయ్గఢ్ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.
ఈ మృతదేహాన్ని అదృశ్యమైన రాజేశ్వర్ ఉడాగా గుర్తించారు. రాజేశ్వర్ కాల్డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది. అయితే రాజేశ్వర్.. పలు వేడుకలకు సినీనటులను తీసుకువచ్చి డ్యాన్స్ లు వేయించేవాడని పొలిసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దెవోలినా భట్టాచార్యను విచారిస్తున్నారు. ఇదిలావుంటే సీరియల్ లలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. తెలుగులో ‘గోపిక’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







