పోలీసుల అదుపులో ‘గోపిక’ నటి.. వజ్రాల వ్యాపారి..
- December 09, 2018
ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడా హత్య కేసులో పలువురు సినీ నటులను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాజాకీయ నాయకుడు సచిన్ పవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా సినీనటి దెవోలినా భట్టాచార్యను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఉడా కాగా గతవారం ఇంటినుంచి కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు రాయ్గఢ్ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.
ఈ మృతదేహాన్ని అదృశ్యమైన రాజేశ్వర్ ఉడాగా గుర్తించారు. రాజేశ్వర్ కాల్డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది. అయితే రాజేశ్వర్.. పలు వేడుకలకు సినీనటులను తీసుకువచ్చి డ్యాన్స్ లు వేయించేవాడని పొలిసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దెవోలినా భట్టాచార్యను విచారిస్తున్నారు. ఇదిలావుంటే సీరియల్ లలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. తెలుగులో ‘గోపిక’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.
తాజా వార్తలు
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..







