పోలీసుల అదుపులో ‘గోపిక’ నటి.. వజ్రాల వ్యాపారి..
- December 09, 2018
ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ ఉడా హత్య కేసులో పలువురు సినీ నటులను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాజాకీయ నాయకుడు సచిన్ పవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా సినీనటి దెవోలినా భట్టాచార్యను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన రాజేశ్వర్ ఉడా కాగా గతవారం ఇంటినుంచి కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు రాయ్గఢ్ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.
ఈ మృతదేహాన్ని అదృశ్యమైన రాజేశ్వర్ ఉడాగా గుర్తించారు. రాజేశ్వర్ కాల్డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది. అయితే రాజేశ్వర్.. పలు వేడుకలకు సినీనటులను తీసుకువచ్చి డ్యాన్స్ లు వేయించేవాడని పొలిసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దెవోలినా భట్టాచార్యను విచారిస్తున్నారు. ఇదిలావుంటే సీరియల్ లలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. తెలుగులో ‘గోపిక’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







