గవర్నర్ను కలవనున్న మహాకూటమి నేతలు
- December 10, 2018తెలంగాణ:రేపు వెలువడే ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే.. గవర్నర్ నిర్ణయం కీలకమవుతుంది. హంగ్ వస్తే ముందుగా ఎవర్ని పిలవాలన్న విషయంలో ఆయన నిర్ణయమే కీలకం. అందుకే.. కూటమి నేతలు ముందే అప్రమత్తమయ్యారు. ప్రజాకూటమిని ఒకటే జట్టుగా చూడాలంటూ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకోవాని కోరనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పరిణామాల దృష్ట్యా.. తెలంగాణలో ముందే మేల్కొన్న కాంగ్రెస్ ముందే రాజ్భవన్ తలుపు తట్టడం కూడా ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ముందే తామంతా కూటమిగా ఉన్నందున.. రేపు ఫలితాల తర్వాత మెజార్టీ సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తమనే పిలవాలని కోరుతున్నారు. ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, ఇన్ఛార్జ్ కుంతియా, కూటమి నేతలు ఎల్.రమణ, కోదండరామ్ సహా పలువురు నేతలు గవర్నర్ను కలవనున్నారు. అటు, రేపు ఫలితాలు రావడంతోనే కూటమి MLAలు అందరినీ సమావేశ పరిచి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కూడా ఉత్తమ్ భావిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎంఐఎం, స్వతంత్రుల్ని కూడా కలుపుకుని వెళ్లేందుు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ