మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్
- December 10, 2018
కోడంబాక్కం: ఒక్కో దర్శకుడికి ఒక్కో కలల చిత్రం ఉంటుంది. కొందరు దర్శకులు తమ కలల సినిమా కోరికను తొలి చిత్రంతోనే నెరవేర్చుకుంటారు. మరి కొందరికి ఆ సందర్భం రావడానికి కాస్త సమయం పడుతుంది. అలా మణిరత్నం మాత్రం 'పొన్నియిన్ సెల్వం' చిత్రాన్ని ఎప్పటి నుంచో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. 'సెక్క చివంద వానం'తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వం' కథను చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా విజయ్, శింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రం నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 'రావణన్' చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇందులో విక్రం ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో ఇద్దరు కథానాయకులు కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పనులు మొదలవుతాయని సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







