మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్‌

- December 10, 2018 , by Maagulf
మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్‌

కోడంబాక్కం: ఒక్కో దర్శకుడికి ఒక్కో కలల చిత్రం ఉంటుంది. కొందరు దర్శకులు తమ కలల సినిమా కోరికను తొలి చిత్రంతోనే నెరవేర్చుకుంటారు. మరి కొందరికి ఆ సందర్భం రావడానికి కాస్త సమయం పడుతుంది. అలా మణిరత్నం మాత్రం 'పొన్నియిన్‌ సెల్వం' చిత్రాన్ని ఎప్పటి నుంచో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. 'సెక్క చివంద వానం'తో మల్టీస్టారర్‌ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్‌ సెల్వం' కథను చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా విజయ్‌, శింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రం నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 'రావణన్‌' చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌ నటించిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇందులో విక్రం ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో ఇద్దరు కథానాయకులు కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పనులు మొదలవుతాయని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com