మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్
- December 10, 2018కోడంబాక్కం: ఒక్కో దర్శకుడికి ఒక్కో కలల చిత్రం ఉంటుంది. కొందరు దర్శకులు తమ కలల సినిమా కోరికను తొలి చిత్రంతోనే నెరవేర్చుకుంటారు. మరి కొందరికి ఆ సందర్భం రావడానికి కాస్త సమయం పడుతుంది. అలా మణిరత్నం మాత్రం 'పొన్నియిన్ సెల్వం' చిత్రాన్ని ఎప్పటి నుంచో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. 'సెక్క చివంద వానం'తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వం' కథను చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా విజయ్, శింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రం నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 'రావణన్' చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇందులో విక్రం ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో ఇద్దరు కథానాయకులు కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పనులు మొదలవుతాయని సమాచారం.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..