మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్
- December 10, 2018
కోడంబాక్కం: ఒక్కో దర్శకుడికి ఒక్కో కలల చిత్రం ఉంటుంది. కొందరు దర్శకులు తమ కలల సినిమా కోరికను తొలి చిత్రంతోనే నెరవేర్చుకుంటారు. మరి కొందరికి ఆ సందర్భం రావడానికి కాస్త సమయం పడుతుంది. అలా మణిరత్నం మాత్రం 'పొన్నియిన్ సెల్వం' చిత్రాన్ని ఎప్పటి నుంచో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. 'సెక్క చివంద వానం'తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వం' కథను చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా విజయ్, శింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రం నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 'రావణన్' చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇందులో విక్రం ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో ఇద్దరు కథానాయకులు కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పనులు మొదలవుతాయని సమాచారం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







