గవర్నర్ను కలవనున్న మహాకూటమి నేతలు
- December 10, 2018
తెలంగాణ:రేపు వెలువడే ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే.. గవర్నర్ నిర్ణయం కీలకమవుతుంది. హంగ్ వస్తే ముందుగా ఎవర్ని పిలవాలన్న విషయంలో ఆయన నిర్ణయమే కీలకం. అందుకే.. కూటమి నేతలు ముందే అప్రమత్తమయ్యారు. ప్రజాకూటమిని ఒకటే జట్టుగా చూడాలంటూ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకోవాని కోరనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పరిణామాల దృష్ట్యా.. తెలంగాణలో ముందే మేల్కొన్న కాంగ్రెస్ ముందే రాజ్భవన్ తలుపు తట్టడం కూడా ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ముందే తామంతా కూటమిగా ఉన్నందున.. రేపు ఫలితాల తర్వాత మెజార్టీ సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తమనే పిలవాలని కోరుతున్నారు. ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, ఇన్ఛార్జ్ కుంతియా, కూటమి నేతలు ఎల్.రమణ, కోదండరామ్ సహా పలువురు నేతలు గవర్నర్ను కలవనున్నారు. అటు, రేపు ఫలితాలు రావడంతోనే కూటమి MLAలు అందరినీ సమావేశ పరిచి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కూడా ఉత్తమ్ భావిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎంఐఎం, స్వతంత్రుల్ని కూడా కలుపుకుని వెళ్లేందుు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







