మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి..
- December 12, 2018
తెలంగాణ:ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది టీఆర్ఎస్. రేపు ఉదయం 8గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ గవర్నర్ను కలిసి సమాచారమిచ్చారు.
ఇవాళ ఉదయం 11న్నర గంటలకు తెలంగాణ భవన్లో TRS-LP సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు… మరోవైపు మంత్రివర్గ కూర్పపై కేసీఆర్ దృష్టిపెట్టారు. పలువురి పేర్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం.. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..
ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.. ఇందుకోసం ప్రోటెం స్పీకర్గా రెడ్యానాయక్ను నియమించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







