మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి..
- December 12, 2018తెలంగాణ:ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది టీఆర్ఎస్. రేపు ఉదయం 8గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ గవర్నర్ను కలిసి సమాచారమిచ్చారు.
ఇవాళ ఉదయం 11న్నర గంటలకు తెలంగాణ భవన్లో TRS-LP సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు… మరోవైపు మంత్రివర్గ కూర్పపై కేసీఆర్ దృష్టిపెట్టారు. పలువురి పేర్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం.. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..
ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.. ఇందుకోసం ప్రోటెం స్పీకర్గా రెడ్యానాయక్ను నియమించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం