నీరసించిన రూపాయి!
- December 12, 2018
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో మంగళవారం షాక్తిన్న దేశీ కరెన్సీ మరోసారి నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 17 పైసలు(0.24 శాతం) బలహీనపడి 72.02కు చేరింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 53 పైసలు(0.7 శాతం) నష్టపోయి 71.85 వద్ద ముగిసింది. అయితే తొలుత ఒక దశలో 110 పైసల వరకూ పతనమైంది. 72.42 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో రూపాయి సైతం బలపడింది. నష్టాలను కొంతమేర రికవర్ చేసుకుని 71.67వరకూ పుంజుకుంది. చివరికి 71.85 వద్ద స్థిరపడింది. మంగళవారం ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 72 మార్క్ను సైతం దాటి బలహీనపడిన రూపాయి నేటి ట్రేడింగ్లో మరోసారి నీరసంగా కదులుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. ఊర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేయడంతో రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







