నీరసించిన రూపాయి!
- December 12, 2018
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో మంగళవారం షాక్తిన్న దేశీ కరెన్సీ మరోసారి నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 17 పైసలు(0.24 శాతం) బలహీనపడి 72.02కు చేరింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 53 పైసలు(0.7 శాతం) నష్టపోయి 71.85 వద్ద ముగిసింది. అయితే తొలుత ఒక దశలో 110 పైసల వరకూ పతనమైంది. 72.42 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో రూపాయి సైతం బలపడింది. నష్టాలను కొంతమేర రికవర్ చేసుకుని 71.67వరకూ పుంజుకుంది. చివరికి 71.85 వద్ద స్థిరపడింది. మంగళవారం ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 72 మార్క్ను సైతం దాటి బలహీనపడిన రూపాయి నేటి ట్రేడింగ్లో మరోసారి నీరసంగా కదులుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. ఊర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేయడంతో రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది
తాజా వార్తలు
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..







