నీరసించిన రూపాయి!
- December 12, 2018రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో మంగళవారం షాక్తిన్న దేశీ కరెన్సీ మరోసారి నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 17 పైసలు(0.24 శాతం) బలహీనపడి 72.02కు చేరింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 53 పైసలు(0.7 శాతం) నష్టపోయి 71.85 వద్ద ముగిసింది. అయితే తొలుత ఒక దశలో 110 పైసల వరకూ పతనమైంది. 72.42 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో రూపాయి సైతం బలపడింది. నష్టాలను కొంతమేర రికవర్ చేసుకుని 71.67వరకూ పుంజుకుంది. చివరికి 71.85 వద్ద స్థిరపడింది. మంగళవారం ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 72 మార్క్ను సైతం దాటి బలహీనపడిన రూపాయి నేటి ట్రేడింగ్లో మరోసారి నీరసంగా కదులుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. ఊర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేయడంతో రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..