నీరసించిన రూపాయి!
- December 12, 2018
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో మంగళవారం షాక్తిన్న దేశీ కరెన్సీ మరోసారి నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే 17 పైసలు(0.24 శాతం) బలహీనపడి 72.02కు చేరింది. మంగళవారం డాలరుతో మారకంలో రూపాయి 53 పైసలు(0.7 శాతం) నష్టపోయి 71.85 వద్ద ముగిసింది. అయితే తొలుత ఒక దశలో 110 పైసల వరకూ పతనమైంది. 72.42 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో రూపాయి సైతం బలపడింది. నష్టాలను కొంతమేర రికవర్ చేసుకుని 71.67వరకూ పుంజుకుంది. చివరికి 71.85 వద్ద స్థిరపడింది. మంగళవారం ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 72 మార్క్ను సైతం దాటి బలహీనపడిన రూపాయి నేటి ట్రేడింగ్లో మరోసారి నీరసంగా కదులుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా.. ఊర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేయడంతో రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్గా ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







