ఫేస్బుక్కు బాంబు బెదిరింపు..కొన్ని భవనాలను ఖాళీ చేయించినట్లు ప్రకటన
- December 12, 2018కాలిఫోర్నియా: అమెరికాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెన్లో పార్క్ నగరంలోని ఫేస్బుక్ ప్రధాన ప్రాంగణంలో కొన్ని భవనాలను ఖాళీ చేయించారు. ప్రాంగణంలోని 200 జెఫ్ఫర్సన్ డ్రైవ్ భవనంలో బాంబు ఉందన్న అనుమానంతో ఉద్యోగులందర్నీ బయటకు పంపేసినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఫేస్బుక్ వెల్లడించింది. భవనంలో అణవణువు పరిశీలిస్తున్నట్లు మెన్లో పార్క్ పోలీసులు ట్విటర్ ద్వారా తెలిపారు. గతంలో యూట్యూబ్ సంస్థ కూడా భద్రతా పరమైన ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. ఈ ఏడాది మేలో శాన్ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఈ లోపం బయటపడింది. ఓ మహిళ ముగ్గురు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి, తర్వాత తనను తాను కాల్చేసుకొని చనిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తూటాల గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి