షార్జాలో 3 దిర్హామ్ల వరకు పెరిగిన బస్ ఛార్జీలు
- December 13, 2018షార్జా సిటీలో బస్ ప్రయాణీకులు ఇకపై 1 నుంచి 3 దిర్హామ్ల వరకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త టారిఫ్ ప్రయాణీకులకు కాస్త భారంగా మారింది. సిటీ మరియు ఇంటర్సిటీ బస్ రూట్స్లో ఛార్జీల్ని పెంచింది షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సిటీ రోడ్స్పై 7 దిర్హామ్లకు బదులుగా 8 దిర్హామ్లు చెల్లించాల్సి వస్తోంది. సాయెర్ కార్డ్స్పై ప్రయాణించేవారు 5.5 దిర్హామ్లకు బదులుగా 6 దిర్హామ్లు చెల్లించాలి. ఇంటర్సిటీ బస్ రూట్స్లో ప్రయాణించేవారికి మరింత అదనపు బాదుడు తప్పడంలేదు. షార్జా నుంచి అబుదాబీ లేదా అల్ అయిన్కి వెళ్ళేవారు 30 దిర్హామ్ల స్థానంలో 33 దిర్హామ్లు చెల్లించాలి. రస్ అల్ ఖైమాకు 25 దిర్హామ్లు గతంలో చెల్లిస్తే, ఇప్పుడు అది 27 దిర్హామ్లకు పెరిగింది. షార్జా నుంచి అజ్మన్కి 1 దిర్హామ్ పెరగగా, ఉమ్ అల్ కువైన్కి 2 దిర్హామ్లు పెరిగింది. ఛార్జీల పెరుగుదల భారంగా మారిందని ప్రయాణీకులుఅ ంటున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు