మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రంతో న్యూ రూ.100 నాణెం

- December 14, 2018 , by Maagulf
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రంతో న్యూ రూ.100 నాణెం

న్యూ రూ.100 నాణెం త్వరలో విడుదల కానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం కొత్త రూ. 100 నాణెం త్వరలో రాబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ అధికారిక ప్రకటన చేసింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది.

నాణెం ఒక వైపు వాజ్‌పేయి చిత్రంతోపాటు ఆయన పేరు దేవనాగరి లిపి, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. నాణెం దిగువన వాజ్‌పేయి పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924, 2018 అని ముద్రించి ఉంటుంది.

నాణెం మరొకవైపు సత్యమేవ జయతే పదాలతో కూడిన నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ ఉంటుంది. ఒకవైపు భారత్‌, మరోవైపు ఇండియా అని ముద్రించి ఉంటుంది. దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com