మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రంతో న్యూ రూ.100 నాణెం
- December 14, 2018
న్యూ రూ.100 నాణెం త్వరలో విడుదల కానుంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం కొత్త రూ. 100 నాణెం త్వరలో రాబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ అధికారిక ప్రకటన చేసింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది.
నాణెం ఒక వైపు వాజ్పేయి చిత్రంతోపాటు ఆయన పేరు దేవనాగరి లిపి, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. నాణెం దిగువన వాజ్పేయి పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924, 2018 అని ముద్రించి ఉంటుంది.
నాణెం మరొకవైపు సత్యమేవ జయతే పదాలతో కూడిన నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ ఉంటుంది. ఒకవైపు భారత్, మరోవైపు ఇండియా అని ముద్రించి ఉంటుంది. దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







