శ్రీలంక రాజకీయ సంక్షోభానికి తెరపడింది

- December 16, 2018 , by Maagulf
శ్రీలంక రాజకీయ సంక్షోభానికి తెరపడింది

శ్రీలంక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాణిల్ విక్రమసింఘె శ్రీలంక ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. నెలన్నర కిందట ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే... విక్రమసింఘెతో ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్‌లో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా విక్రమసింఘె ప్రమాణ స్వీకారం చేశారు. మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘెకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న రాజకీయ సంక్షోభం మొదలైంది. ప్రధానిగా ఉన్న విక్రమసింఘెను తొలగించి రాజపక్సను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్స నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com