200,000 ప్రైజ్ స్కామ్: 19 మంది అరెస్ట్
- December 17, 201819 మంది సభ్యులుగల ముఠాని అజ్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోగస్ క్యాష్ ప్రైజులతో అమాయకుల్ని నిందితులు మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారంతా ఆసియాకి చెందినవారే. అజ్మన్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ హమాద్ బిన్ యఫౌర్ అల్ ఘాఫ్లి మాట్లాడుతూ, ఓ టెలికామ్ సంస్థ నుంచి 200,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా తమకు ఫోన్లు వచ్చాయని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి నిందితుల్ని అరెస్ట్ చేశామని అన్నారు. బ్యాంక్ డిటెయిల్స్ ఇస్తే, డబ్బుని జమ చేస్తామని నిందితులు కోరుతున్నారని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, అజ్మన్లో నిందితులు దాక్కున్న స్థలాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..