ఆగస్టు 15 విడుదలకి ఫిక్సయిన 'సాహో'
- December 18, 2018
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'. శ్రద్దాకపూర్ హీరోయిన్. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. ఆగస్టు 15కి వెళ్లిందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ డేటుని అధికారంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. జెండా పండగ (ఆగస్టు 15) రోజున సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు.
2019లో రాబోయే భారీ సినిమా సాహో. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక, సాహో తో పాటు షూటింగ్ జరుపుకొంటున్న మరో భారీ సినిమా మెగాస్టార్ 'సైరా' విడుదల ఇంకా తేది ఇంకా ఖరారు కాలేదు. సైరా 2020 సంక్రాంతి రాబోతుందని తెలుస్తోంది.
ఇక, సాహో ఆగస్టు 15కి వెళ్లడంతో సమ్మర్ సీజన్ లో వచ్చే సినిమాలకి ఇబ్బంది తొలగినట్టయింది. మహేష్ మహర్షి సినిమా ఒకటి సమ్మర్ కే వస్తుంది. ఏప్రియల్ 5న మహర్షి విడుదల కాబోతుంది. నాని 'జెర్సీ' కూడా ఏప్రియల్ లోనే అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా, విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలు సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









