దోహా లో ముగిసిన క్రికెట్ పోటీలు..

- December 19, 2018 , by Maagulf
దోహా లో ముగిసిన క్రికెట్ పోటీలు..

దోహా:దోహా లో ఘనంగా ముగిసిన తెలంగాణ గల్ఫ్ సమితి ప్రీమియం లీగ్ 4.గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీల లో ఈ రోజు కతర్ నేషనల్ డే సందర్బంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.
ఈ మ్యాచ్ లో దోహర్ వారియర్స్ తో జయశంకర్ టీం తలపడగ ..దోహా వారియర్స్ విజయం సాధించి TGS TPL 4 కప్పు కైవసం చేసుకుంది.
ఇట్టి కార్యక్రమానికి ICBF VicePresident, బాబు రాజన్ ..ICC Genaral secaretry మహేష్ గౌడ ,  కన్నడ సంఘము ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, TKS_President హరీష్  రెడ్డి ,  పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గద్దె  మరియు QPL టౌర్నమేట్ వారు అతిధులుగా పాల్గొన్నారు.
విజయం పొందిన జట్టుకు అభినందనలు తెలిపారు.అనంతరం మన తెలంగాణ వంటకాలు తో ఆటగాళ్లకు,ప్రేక్షకులకు,అతిధులకి విందు బోజనమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ సభ్యులందరు కలసి కట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని  విజయవంతం చేసారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com