సీఎం కుమార్ స్వామి ఇంట్లో బాంబ్: అప్రమత్తమైన పోలీసు బలగాలు
- December 19, 2018
కర్ణాటక: కన్నడ పోలీసులను ఓ ఫోన్ కాల్ పరుగులు పెట్టించింది. సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టారని..ఆ బాంబ్ కొద్ది సమయంలోనే పేలనుందని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారులు ఆగమేఘాలమీద ఉరుకులు పరుగులు పెట్టారు. ఫోన్ కాల్ పై అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లిన పోలీసులు, తనిఖీల అనంతరం అదో ఫేక్ కాల్ అని తేల్చారు. ఆపై ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన జేపీ నగర్ పోలీసులు, మన్సూర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అతను గోపాల్ గా మార్చి చెప్పాడని పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. కాగా ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇటువంటి ఫేక్ కాల్స్ చేయటం ఆకతాయిలకు కామన్ గా మారిపోయింది. ఇటువంటి ఘటనలు గతంలో పలు సందర్భాలలో జరిగిన విషయం తెలిసిందే. గుర్తింపు కోసమో లేక ఆటపట్టిద్దామనో ఆకతాయిలు ఇటువంటి ఫేక్ కాల్స్ చేస్తుంటారు. కానీ అదే నిజమైతే..ఫేక్ అని పోలీసులు భావిస్తే..నష్టం మాత్రం భారీగా వుండొచ్చు. కాబట్టి ఫేక్ కాల్స్ తో తప్పుదారి పట్టించటం సరికాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరముందని గుర్తించాలి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







