ఆధార్.. అడిగితే భారీ ఫైన్, జైలు
- December 19, 2018
ఆధార్.. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అన్ని అవసరాలకు లింక్ చేసి మనిషికి నిత్యావసరంగా ప్రభుత్వాలు మార్చేశాయి. కానీ ఇది వ్యక్తి స్వేచ్ఛను హరించే గుర్తింపు కార్డు కావడంతో సుప్రీం కోర్టు ఆధార్ను వివిధ పనులకు ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోరాదని తీర్పునిచ్చింది. తాజాగా టెలికాం కంపెనీలు, బ్యాంకులకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.
లబ్ధిదారులు ఎవరైనా మొబైల్ కనెక్షన్ కోసం గానీ. బ్యాంకు ఖాతా తెరవడం కోసం కానీ టెలికాం, బ్యాంకు సంస్థలు ఆధార్ ను ఖచ్చితంగా కావాలని అడిగితే శిక్షార్హం అయ్యేలా కేంద్ర కేబినెట్ ఆర్డర్ తీసుకురాబోతోంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు అమెండ్ మెంట్ ను తీసుకొచ్చింది. బ్యాంకులు, మొబైల్ సంస్థలు ఆధార్ ను తప్పనిసరి చేయవద్దని సూచించింది. అదే సమయంలో వ్యక్తి గుర్తింపు కోసం పాస్ పోర్టు లేదా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఆ సిబ్బంది ఎవరైనా ఆధార్ తప్పనిసరి అని కోరితే కోటి రూపాయల వరకు జరిమానా మరియు జైలు శిక్ష కూడా పడుతుందని కేంద్రం అమెండ్ మెంట్ లో పేర్కొంది.
ఇక నుంచి ఆధార్ లబ్ధిదారులు కూడా ప్రతి కేవైసీ కోసం ఆధార్ ను ఇవ్వనవసరం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తోపాటు పీఎంఎల్ అనుసరించి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ ను పింఛన్, ప్రభుత్వ నిధులు పొందేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేయడాన్ని ఉపసంహరించారు.
ఈ అమెండ్ మెంట్ ను త్వరలోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో రాష్ట్రాల ఇష్టాయిష్టాలను బట్టి ఆధార్ ను ఉపయోగించుకోవచ్చని కూడా వెసులుబాటును కల్పిస్తోంది.
ఆధార్ బయోమెట్రిక్ కావడంతో వ్యక్తి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటోంది. దీన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ డేటాను తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే డేటా దుర్వినియోగం అయితే 50 లక్షల ఫైన్ తోపాటు 10 లక్షల జరిమానాను కేంద్రం విధించేలా కఠిన నిబంధనలు రూపొందించింది. కొన్ని టెలికాం సంస్థలు తమ వద్దకు వచ్చిన వ్యక్తుల ఆధార్ ఐడీలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నట్టు తేలింది. ఆధార్ ను లబ్ధిదారుల నుంచి సేకరించే సమయంలోనే కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నట్టు తేలింది. ఆధార్ కాపీలను 10వేల నుంచి లక్ష వరకు కూడా అమ్ముకున్నట్టు గుర్తించారు. అందుకే ఇక నుంచి ఆధార్ అడిగితే కోటి వరకు జరిమానా, జైలు శిక్షను విధిస్తామని కేంద్రం సవరణను తీసుకురాబోతోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







