నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F11

- December 19, 2018 , by Maagulf
నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F11

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సంచలన విజయం నమోదు చేసింది. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 7ఏని విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఇవాళ సాయత్రం సరిగ్గా 4:10కి జీఎస్ఎల్వీ మార్క్2 ఎఫ్ 11 రాకెట్ ద్వారా 2,250 కేజీల బరువైన ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీశాట్ 7ఏ వైమానిక రంగానికి 8ఏళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహ శ్రేణిలో జీశాట్ 7ఏ మూడోది. కేవలం నెలరోజు వ్యవధిలోనే ఇస్రో మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం. సమాచార వ్యవస్ధలో ఇప్పటివరకు ఇస్రో 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. తాజాగా ప్రయోగించిన ఉపగ్రహంతో భారత సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com