వరుస దొంగతనాలతో అమ్వాజ్‌ రెసిడెంట్స్‌ ఆందోళన

- December 20, 2018 , by Maagulf
వరుస దొంగతనాలతో అమ్వాజ్‌ రెసిడెంట్స్‌ ఆందోళన

అమ్వాజ్‌ ఐలాండ్స్‌లో వరుస దొంగతనాలు రెసిడెంట్స్‌ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో 300 బహ్రెయినీ దినార్స్‌ దొంగిలించారు దొంగలు. ఓ వలసదారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఏదో శబ్దం అవుతోందని గుర్తించిన బాధితుడు, లేచి చూసే సరికి.. దొంగ పారిపోతున్నట్లు గుర్తించడం జరిగింది. కంగారులో దొంగ, తన పర్సులోని డబ్బు తీసుకుని పారిపోయాడనీ, అదృష్టవశాత్తూ ఆ పర్స్‌ని దొంగ పారేయడంతో తాను ఊపిరి పీల్చుకున్నాననీ, అందులో విలువైన డాక్యుమెంట్స్‌ వున్నాయని బాధఙతుడు చెప్పారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఓ మహిళ తన ఇంట్లోంచి 600 బహ్రెయినీ దినార్స్‌ని దొంగలు దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. కాగా, ముహరాక్‌ పరిధిలో నలుగురు దొంగల్ని అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. ముహరాక్‌ గవర్నరేట్‌ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com