వరుస దొంగతనాలతో అమ్వాజ్ రెసిడెంట్స్ ఆందోళన
- December 20, 2018
అమ్వాజ్ ఐలాండ్స్లో వరుస దొంగతనాలు రెసిడెంట్స్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా ఘటనలో 300 బహ్రెయినీ దినార్స్ దొంగిలించారు దొంగలు. ఓ వలసదారుడి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఏదో శబ్దం అవుతోందని గుర్తించిన బాధితుడు, లేచి చూసే సరికి.. దొంగ పారిపోతున్నట్లు గుర్తించడం జరిగింది. కంగారులో దొంగ, తన పర్సులోని డబ్బు తీసుకుని పారిపోయాడనీ, అదృష్టవశాత్తూ ఆ పర్స్ని దొంగ పారేయడంతో తాను ఊపిరి పీల్చుకున్నాననీ, అందులో విలువైన డాక్యుమెంట్స్ వున్నాయని బాధఙతుడు చెప్పారు. తెల్లవారుఝామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరో ఘటనలో ఓ మహిళ తన ఇంట్లోంచి 600 బహ్రెయినీ దినార్స్ని దొంగలు దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. కాగా, ముహరాక్ పరిధిలో నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ముహరాక్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..