కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్
- December 20, 2018
ప్రయాగ్రాజ్: ప్రయాగ్రాజ్ నగరంలో జరగబోయే కుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు టెంట్ హోటల్స్ను ఏర్పాటు చేశారు. ఫైవ్స్టార్ రేంజ్లో భక్తులకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ లగ్జరీ టెంట్లలో బస చేసేందుకు వీలుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని ప్రయాగ్రాజ్ నగర కమీషనర్ ఆశిష్ గోయల్ చెప్పారు. కుంభమేళాకు దాదాపు 25 లక్షల మంది విదేశీ భక్తులు రానుండడంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ టెంట్లను నిర్మించారు. ఈ టెంట్లలో వైఫై, లగ్జరీ టాయిలెట్లు, టివి సెట్లు, డబుల్ బెడ్రూం సౌకర్యాలు కలవు. కుంభమేళా సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా అలంకరించిన రైళ్లను నడపనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







