కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్‌ హోటల్స్‌

- December 20, 2018 , by Maagulf
కుంభమేళాకు విచ్చేసే విదేశీ భక్తులకు టెంట్‌ హోటల్స్‌

ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌ నగరంలో జరగబోయే కుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు టెంట్‌ హోటల్స్‌ను ఏర్పాటు చేశారు. ఫైవ్‌స్టార్‌ రేంజ్‌లో భక్తులకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ లగ్జరీ టెంట్లలో బస చేసేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలని ప్రయాగ్‌రాజ్‌ నగర కమీషనర్‌ ఆశిష్‌ గోయల్‌ చెప్పారు. కుంభమేళాకు దాదాపు 25 లక్షల మంది విదేశీ భక్తులు రానుండడంతో వారికి సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ టెంట్లను నిర్మించారు. ఈ టెంట్లలో వైఫై, లగ్జరీ టాయిలెట్లు, టివి సెట్లు, డబుల్‌ బెడ్‌రూం సౌకర్యాలు కలవు. కుంభమేళా సందర్భంగా రైల్వేశాఖ ప్రత్యేకంగా అలంకరించిన రైళ్లను నడపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com