ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..

- December 20, 2018 , by Maagulf
ఎన్నారై భర్త పైశాచికత్వం తట్టుకోలేక..

మరో ఎన్నారై భర్త తన పైశాచికత్వాన్ని చూయించాడు. తన భార్య ఆత్మహత్యకు కారణం అయ్యాడు.సికింద్రాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో వీఆర్ఓ గా పనిచేస్తున్న నాగమణికి మాణిక్కేశ్వర్ నగర్ ప్రాంతానికి చెందిన ఎన్నారై మారుతితో 2014లొ వివాహం జరిగింది.ఎన్నారై కావడంతో కట్నకానుకలు ఎక్కువగానే అడిగి తీసుకున్నారు.వీరికి మూడు సంవత్సరాల బాబు వున్నాడు.

గత కొంతకాలంగా నాగమణి మీద అనుమానంతో భర్త అత్తమామలు అదనపు కట్నం తీసుకురమ్మని వేధించటం మొదలు పెట్టారు. నాగమణి కొడుక్కి అవసరమైన ఆపరేషన్ కూడా భర్త చేయించటానికి నిరాకరంచడంతో ఆమె తట్టుకోలేక పోయింది. భార్య భర్తల మధ్య గొడవలు పెరిగాయి.ఈ నేపధ్యంలో గత మూడు రోజుల క్రితం హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సికింద్రాఆద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.దీంతో నాగమణి బంధువుల ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com