త్వరలో రజనీకాంత్ టీవీ ఛానెల్ ప్రారంభం
- December 21, 2018
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరు ఎజెండా ప్రకటించగా, రజనీకాంత్ తన పార్టీకి 'మక్కల్ మంద్రమ్' అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించాడు రజనీ. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే రజనీకాంత్ పేరుతో ఓ టీవీ ఛానెల్ ప్రారంభం కాబోతుందనే విషయాన్ని రజనీ మక్కల్ మంద్రమ్ కన్వీనర్ వీఎం సుధాకర్ తెలిపారు. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవర్ టీవీ ఇలా మూడు పేర్లతో ట్రేడ్మార్కర్లని నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించామని సుధాకర్ అన్నారు. రజనీ పేరు, లోగోలో ఆయన ఫోటో పెట్టడంపై రజనీకాంత్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. త్వరలోనే ఈ ఛానెల్కి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తాం అని సుధాకర్ స్పష్టం చేశారు. రజనీకాంత్ నటించిన పేటా సంక్రాంతికి రానుండగా,ఆ తర్వాత మురుగదాస్తో తన 166వ సినిమా చేయనున్నాడు మన సూపర్ స్టార్.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







